September 21, 2024

PM Kisan yojana: పీఎమ్ కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణం అదేనట..!

1 min read
Reson behind the why pm kisan yojana money did not get the money

PM Kisan yojana: పీఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారులకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. అయితే ఈ విషయం ఏమిటో తెలుసుకొని డబ్బులు మీ ఖాతాలో పడేలా చేస్కోండి. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ విడత పీఎమ్ కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాలో వేయబోతుంది. కేవైసీని పూర్తి చేయడానికి గడువును కూడా పెట్టింది. అయితే ఈ కేవైసీ తప్పనిసరి. కేవైసీ గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని కూడా కేవైసీని హాయుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Reson behind the why pm kisan yojana money did not get the money

కొంత కాలం క్రితం కిసాన్ యోజన పోర్టల్ లో ఈ కేవైసీ సదుపాయాన్ని నిలిపి వేసిన కేంద్ర ప్రబుత్వం… ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. 11వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా చేసుకోవాలో ఇఫ్పుడు తెలుసుకుందాం.

మొబైల్ లేదా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ సాయంతో ఇంట్లో కూర్చొని ఈ కేవైసీ చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు పీఎమ్ కిసాన్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం సమీపంలోని సీఎస్ సీ కేంద్రాలను సంప్రదించండి. అయితే ఇందుకోసం చివరి తేదీ మే 30, 2022 వరకు కొనసాగించారు.