Phonepe:సాధారణంగా ఏదైనా పండుగలు ప్రత్యేక రోజుల్లో సమయంలో వివిధ రకాల కంపెనీలు అద్భుతమైన బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ సందర్భంగా ఎన్నో గోల్డ్ కంపెనీలు బంగారు నగల కొనుగోలుపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ సందర్భంగా అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్ పే ద్వారా బంగారు నగలను కొనుగోలు చేస్తే కళ్లు చెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది.
ఈ యాప్ ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ప్రకటించారు.రక రకాల డిజైన్లలో గోల్డ్ కాయిన్స్ రూపంలోనో, లేదంటే బార్ల రూపంలో డెలీవరీ చేయనున్నారు. ఈ యాప్ ద్వారా బంగారం కొన్నవారికి2,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించారు. అలాగే వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి 250 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అయితే ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం మే 3వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.
ఇక ఫోన్ ఫే ద్వారా ఎవరైతే 99.99% స్వచ్ఛమైన బంగారు వెండి ఆభరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇక వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛమైనదని తెలుపుతూ ప్రతిసారీ స్వచ్ఛతకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా వినియోగదారులకు అందించనుంది. ఈ క్రమంలోనే వినియోగదారులు ఏ సమయంలో అయినా ఫోన్ యాప్ ద్వారా మగువలు మెచ్చిన నచ్చిన బంగారు నగలను కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.