Akshaya Tritiya 2022:పురాణాల ప్రకారం బ్రహ్మ కుమారుడు అక్షయ్ కుమార్ జన్మించిన రోజున అక్షయ తృతీయను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజున ప్రతి ఏడాది అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం ఎంతో మంచిదని ప్రతి ఒక్కరు అక్షయ తృతీయ రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మనం ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే అక్షయ తృతీయ రోజు ఈ దానాలు చేయడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి అక్షయ తృతీయ రోజు ఎవరు ఏ దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…
మేష రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు ఎరుపు రంగు వస్త్రం, లడ్డూలను దానం చేయాలి.
వృషభం: వృషభ రాశి వారు అక్షయతృతీయ రోజు నీటితో నిండిన కలశం దానం చేయాలి.
మిథునం: ఈ రాశివారు చంద్రుడి అనుగ్రహం కోసం అక్షయ తృతీయ రోజు పప్పు దానం చేయాలి.
కర్కాటకం: ఈ రాశివారికి చంద్రుడు అధిపతి కనుక ముత్యంతో ఉన్న నగలను ధరించడం వల్ల ఈ రాశి వారికి చంద్ర బలం పెరుగుతుంది.
సింహం: అక్షయ తృతీయ రోజు సింహ రాశి వారు ఉదయమే నిద్రలేచి సూర్యునికి నీటిని సమర్పించి అనంతరం బెల్లం దానం చేయాలి.
కన్య: కన్య రాశి వారు నవరత్నాలలో ఒకటైన పచ్చ ధరించడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజు దీనిని ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల: తులా రాశి వారు అక్షయ తృతీయ రోజు తెల్లని వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.
వృశ్చిక రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు పగడం ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు దుస్తులను, వస్త్రాలను దానం చేయాలి.
మకర రాశి మకర రాశి వారు అక్షయ తృతీయ రోజు నువ్వుల నూనెను దానం చేయటం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు.
కుంభం: కుంభ రాశి వారు అక్షయ తృతీయ రోజు నల్లని నువ్వులు, కొబ్బరి, ఇనుము దానం చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు.
మీనం:మీన రాశి వారు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.