Weather Report : భానుడి భగభగతో మండిపోతున్న జనాలు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Weather Report : భానుడు తన మంటలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. మండుటెండలు, ఉక్కపోత పౌరులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పగటి పూటా అల్లాడిస్తుండగా. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదు అవుతున్నాయి.

Heatwave in parts of telangana
Heatwave in parts of telangana

తెల్లవారుజాము నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే… నిప్పుల్లో అడుగు పెట్టినట్లుగా అల్లాడిపోతున్నారు. ఏదైనా అవసరం నిమిత్తం ఆరు బయటకు వెళ్లాలన్నా ఈ తీవ్ర ఎండలకు భయపడిపోతున్నారు. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. ఎండలు, వడగాల్పుల భయంతో చాలా మంది బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప… ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుబీర్, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ లలో అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ములుగు జిల్లాలోని మేడారంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, ఆదిలాబాద్ అర్బన్, నిర్మల్ జిల్లాలోని తానూర్ లలో 42.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Read Also : Astrology: కుంభ రాశిలోకి ప్రవేశించనున్న శని… శని ప్రభావంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel