ద్విచక్ర వాహనంపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా అలా కూర్చొని వెల్తే కఛినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటన కేరళలోని పాలక్కడ్ లో చోటు చేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ వర్కర్ను ఎస్డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యకు.. బైకుపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడాన్ని నిషేధించడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ షాప్కు టూవీలర్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పట్టపగలే అతడిని హత్య చేశారు. ఏప్రిల్ 15న ఎస్డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో జంట హత్యలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని భావించిన అడిషన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయి.