Rashmi gautham: ఆ బాధ నాకు కూడా తెలుసంటూ రష్మీ గౌతమ్ కన్నీరు.. ఏమైందో తెలుసా?
1 min readRashmi gautham : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో వార్త వస్తూనే ఉంటుంది. ఇది వరకే రష్మీకి పెళ్లి అయిందని.. విడాకులు కూడా అయిపోయాయని.. అందుకే ఒంటరిగా ఉందంటూ ఇలా కథనాలు వస్తుంటాయి. అయితే రష్మీ మాత్రం ఎప్పుడూ వీటి మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆన్ స్క్రీన్ మీద రష్మీ లవ్ స్టోరీ మాత్రం ఎక్కువగా వైరల్ అవుతోంది. బుల్లి తెరపై రష్మీ సుధీర్ జోడి ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.
గత కొన్నేళ్లుగా రష్మీ, సుధీర్ జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. జబర్దస్త్ షోకు ఈ ఇద్దరూ మైలేజ్ గా మారిపోయారు. ఇక పండగలు వస్తే ఈ ఇద్దరి మీదే ఈవెంట్లు ప్లాన్ చేసేవారు. అలా రష్మీ, సుధీర్ ప్రేమ కథకు బాగానే కలరింగ్ ఇచ్చారు. కానీ తామిద్దరం మాత్రం మంచి స్నేహితులం అని చెబుతూ ఉంటారు. ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలో తాజాగా రష్మీ మీద ఓ స్పెషల్ స్కిట్ వేసినట్లు కనిపిస్తోంది. తాజాగా వదిలిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో రాం ప్రసాద్ స్కిట్ లో రష్మీ నటించినట్లు తెలుస్తోంది.
అయితే పెళ్లి కొడుకుని మాత్రం చూపించకుండా సస్పెన్స్ పెంచేశారు. అది సుధీర్ అయి ఉంటాడా.. అని చాలా మంది అనుకుంటున్నారా. అది ఎవరనేది వచ్చే వారం తెలుస్తోంది. అయితే రష్మీ మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు అందరినీ టచ్ చేశాయి. మనస్పూర్తిగా మనం ఒకరికి మనసును ఇస్తే… గుండె చప్పుడు అగే వరకు అక్క వారికే స్థానం ఉంటుందని… మనకు ఇష్టం ఉన్నా వాళ్లు మన పక్కన లేకపోతే కల్గే బాధ ఏంటో నాకు తెలుసు అంటూ రష్మీ అందరినీ ఏడిపించేసింది.
Read Also :Jabardasth chalaki chanti: రీతూ, అజార్ లపై చలాకీ చంటి కామెంట్స్.. ఏంటిది అంటున్న నెటిజెన్లు!