September 21, 2024

Akshaya tritiya : అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాముఖ్యత.. ఆ విశేషాలేంటంటే?

1 min read
Akshaya tritiya

Akshaya tritiya

Akshaya tritiya : పసిడి కొనేందుకు అక్షయ తృతీయను మంచి రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు కొంతైన బంగారాన్ని కొనాలని చాలా మంది అనుకుంటారు. ఆ రోజు ఎంతో కొంత బంగారం ఇంట్లోకి వస్తే సంవత్సరం మొత్తం పసిడి వరిస్తుందని అంటారు పండితులు. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి.. ఆ రోజు ఎందుకు బంగారం కొనాలని అందరూ అంటుంటారు. దీని వెనక ఉన్న ఆచారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ వచ్చే నెలలోనే వస్తోంది. మే 3 వ తేదీన అక్షయ తృతీయ. రోహిణీ నక్షత్రంలో మధ్యాహ్నం 12:34 గంటలకు అక్షయ తృతీయ గడియలు ప్రారంభమవుతాయి.

Akshaya tritiya
Akshaya tritiya

అలాగే మే 4 వ తేదీ మధ్యాహ్నం 3:18 గంటలకు ముగుస్తున్నాయి. అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం మాత్రమే కాకుండా పట్టు వస్త్రాలు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు. దానం చేయడం వల్ల ధాన్యం సుసంపన్నం అవుతుందని విశ్వసిస్తారు. విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. పరశురామ జయంతిని కూడా ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. భగీరథుని కఠోరమైన తపస్సుకు సంతోషిస్తూ ఈ రోజ గంగామాత భూమిపైకి వచ్చిందని మరి కొన్ని శాస్త్రాల్లో ఉంది. అంతే కాదు, ఈ రోజున అన్నపూర్ణ తల్లి జన్మించిందని కూడా నమ్ముతారు.

నర-నారాయణుడు అక్షయ తృతీయ రో అవతరించినట్లు నమ్ముతారు. మహాభారతం ప్రకారం, ఈ రోజున శ్రీకృష్ణుడు పాండవుల వనవాస సమయంలో వారికి అక్షయ పాత్ర ఇచ్చాడని భావగవతంలో ఉంది. ఈ అక్షయ పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎల్లప్పుడూ ఆహారంతో నిండి ఉంటుంది. దీంతో పాండవులకు వనవాసంలో ఉన్నా వారికి ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు.

Read Also :Vastu Tips : సంధ్యా సమయం తర్వాత పొరపాటున ఈ వస్తువులు దానం చేస్తున్నారా… సమస్యలు తప్పవు..!