...

Guppedantha Manasu: మహేంద్ర చేసిన పనికి షాక్ అయిన రిషి.. ధరణి పై విరుచుకు పడుతున్న దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Advertisement

దేవయాని ఎవరి మీద ఉన్న కోపం అంత ధరణి ఫై చూపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరు ఎవరి గురించి సరిగా పట్టించుకోవడం లేదు అంటూ, నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అంటూ ధరణిపై కోప్పడుతుంది. మరొకవైపు కేవలం మిషన్ ఎడ్యుకేషన్ కారణంగా కాలేజీకి పేరు వచ్చింది అంటే నేను ఒప్పుకోను అని మహేంద్ర తో అనగా అప్పుడు మహేంద్ర కాలేజీ విషయాలు కాలేజీలో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అంటాడు.

Advertisement

అప్పుడు రిషి సరే కాలేజీలో మీటింగ్ అరేంజ్ చేస్తాను అప్పుడు మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి అని అంటాడు. మరొకవైపు గౌతమ్ వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ వసు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గౌతమ్ రిషి ని మొబైల్ ఇవ్వు కాల్ చేసుకొని ఇస్తాను అని ఎంత అడిగిన కూడా రిషి మొబైల్ ఎవ్వడు.

Advertisement

ఇక రెస్టారెంట్ లో జరిగిన విషయం గురించి వసుధారని అడుగుతూ నీవు ఉత్సాహానికి కారణం ఏంటి అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసు ఉత్సాహంగా ఉండడం మంచిదే కదా సార్ అని రిప్లై ఇస్తుంది. మరొకవైపు మహేంద్ర జగతి మీద కోపంతో ప్రాజెక్టు రిజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు అని రిషి తో అంటాడు మహేంద్ర.

Advertisement

నీకు ఇష్టం వచ్చిన విధంగా నువ్వు అభిప్రాయం తీసుకున్నప్పుడు నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను అభిప్రాయం తీసుకుంటాను. రాత్రంతా బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటారు మహేంద్ర. కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అంటూ రిషి కి రాజీనామా పత్రాన్ని అందించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

Advertisement

మహేంద్ర చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రిషి ఎంత పిలుస్తున్న పలకకుండా మహేంద్ర అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మహేంద్ర అలా చేయడానికి కారణం జగతి అని భావించిన రిషి ఆమెతో విరుచుకు పడతాడు. ఈ విషయాలు అన్నీ మళ్ళీ మా డాడీ కి చెప్పద్దు అంటూ దండం పెడతాడు రిషి. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement