...

Pension scheme: నెలకు 5 వేల పెన్షన్ కావాలంటే.. మీరు ఈ స్కీంలో చేరాల్సిందే!

Pension scheme: వృద్ధాప్యంలో లభించే పెన్షన్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ చాలా పాపులర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ స్కీంలో చేరే వారికి వృద్ధాప్యంలో 1000 రూపాయల నుంచి 5000 వరకు వస్తుంది. ఈ పెన్షన్ పొందాలంటే స్కీమ్లో చేరిన నాటి నుంచి ప్రతీ నెలా కొంత మొత్తం జమ చేయాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ లభిస్తుంది. ఈ పాపులర్ స్కీంలో 2021-2022 ఆర్థిక సంవత్సరంలోనే 99 లక్షల మంది చేరారు. అంటే సుమారు కోటి మంది వరకూ ఈ స్కీంలో డబ్బులు కడుతున్నారు. 2022 మార్చి నాటికి ఈ స్కీంలో చేరిన వారి సంఖ్య 4.01 కోట్లకు చేరింది.

Advertisement

Advertisement

చిన్న వయసు నుంచే రిటైర్ మెంట్ ఫండ్ పై దృష్టి పెట్టానుకునే వారికి అటల్ పెన్షన్ యోజన అందుబాటులో ఉంది. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరితే మిగతా వయసుల కన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవ్చచు. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగే ఈ పథకానికి 18 నుంచి 40 ఏల్ల వారు అర్హులు. 18 ఏళ్లు ఉన్న వారు ఈ పథకంలో చేరితే 42 ఏళ్ల పాటు ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలి. అలాగే 40 సంవత్సరాలు ఉన్న వారు మరో 20 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఖాతాదారుల వయసు ఏదైనా వారికి 60 ఏళ్లు వచ్చే దాకా ప్రీమియం చెల్లింపులు కొనసాగుతాయి.

Advertisement
Advertisement