Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు..!

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీ) కోటా కింద ఇచ్చే సీట్లను పూర్తిగా రద్దు

By Vinod Kumar

Published on: April 13, 2022 5:46 PM

Updated on: April 14, 2022 9:55 AM

Kendriya Vidyalay

---Advertisement---

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీ) కోటా కింద ఇచ్చే సీట్లను పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించింది కేవీఎస్​. ఈ కోటాలో సీట్ల సంఖ్యను మరింత పెంచాలని ఎంపీలు గత కొంత కాలంగా డిమాండ్లు చేస్తున్న తరుణంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎంపీలతో పాటు ఇతర కోటాల కింద సీట్లను భర్తీ చేసే ప్రక్రియను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Kendriya Vidyalay
Kendriya Vidyalay

ఓ వైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రద్దు చేయడం గమనార్హం. అయితే కేవీఎస్ తీసుకున్న ఈ నిర్ణయానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీలు సీట్ల సంఖ్యను పెంచమని కోరుతుండగా.. పూర్తిగా రద్ద చేయడం ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలా చేయడం సరైన పద్దతి కాదంటూ వివరిస్తున్నారు.

Advertisement

Read Also : 

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :