Guppedantha Manasu Oct 26 Today Episode : రిషి మాటలకు షాక్ అయిన దేవయాని.. బాధతో కుమిలిపోతున్న జగతి మహేంద్ర..?

Guppedantha Manasu Oct 26 Today Episode : తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి బాధను చూసి జగతి వాళ్ళు ఎమోషనల్ అవుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో రిషి గౌతమ్ తో మాట్లాడుతూ నేను డాడ్ కి ఎదురు వెళ్లి సారీ చెప్తే డాడ్ కూల్ అయిపోతారు డాడ్ ది చిన్న పిల్ల మనస్తత్వం అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న మహేంద్ర వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అప్పుడు రిషి డేట్ నా పక్కనే ఉన్నట్టు ఉంది గౌతం అనడంతో మహేంద్ర మరింత కుమిలిపోతూ ఉంటాడు.

Advertisement

ఇప్పుడు గౌతమ్ ఎమోషనల్ అవుతూ కంగారు పడుతూ ఉండగా ఏంటి సార్ ఇందాక నుంచి మీరు ఏదో కంగారులో ఉన్నట్టున్నారు అని అడుగుతుంది. అప్పుడు రిషి కూడా అవును రా నేను కూడా అదే అనుకుంటున్నాను అనడంతో మరి నా ఫ్రెండ్ బాధ పడుతుంటే నేను జోకులు వేసి నవ్వించమంటావా అని అంటాడు గౌతమ్.

అప్పుడు చూసి సరే రా మేము వెళ్ళొస్తాము డాడ్ వాళ్ళు కనిపిస్తే చెప్పు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. తరువాత జగతి వాళ్ళు బయటికి వచ్చి రిషి బాధను చూసి మరింత బాధపడుతూ ఉంటారు. రేపు పొద్దున ఈ విషయం తెలిస్తే రిషి నన్ను ఏమంటాడో అని నాకు భయంగా ఉంది అంకుల్ అని అంటాడు.

Guppedantha Manasu అక్టోబర్ 26 ఎపిసోడ్ : ధరణి, గౌతమ్ వసుధారలు సంతోషం..

అప్పుడు మహేంద్ర నీలాంటి ఫ్రెండ్ దొరకడం మానేసి అదృష్టం అనే గౌతమ్ ని పొగుడుతూ ఉంటాడు. అంతేకాకుండా గౌతమ్ ని గట్టిగా హద్దుకొని నా తరపున రిషికి ఇవ్వు అని అంటాడు. ఆ తర్వాత రిషి తన గదిలో ఒంటరిగా కూర్చుని మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది.

Advertisement

ఏంటి అక్కడే నిలుచున్నావు లోపలికి రా అని అనగా ఏంటి అలా చూస్తున్నావు అని అనటంతో నిన్ను కాదు సార్ ఆ కుర్చీని మీరు ఎప్పుడు దాని మీదే కూర్చుంటారు నాకు జెలసీగా ఉంది అనడంతో అప్పుడు రిషి అవునా అంటూ వసుధారని ఆ కుర్చీలో కూర్చోమని చెబుతాడు. ఇప్పుడు వసుధార కూర్చుంటుండగా ఆ సమయంలో వసుధరకి ఆ కుర్చీ కాలు తగలడంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు.

jagathi-and-mahendra-get-emotional-in-todays-guppedantha-manasu-serial-episode
jagathi-and-mahendra-get-emotional-in-todays-guppedantha-manasu-serial-episode

తగిలిందా వసు నేను వెళ్లి ఐస్ క్యూబ్స్ తీసుకుని వస్తాను అని అంటాడు. అప్పుడు వసు పర్లేదు సార్ అని చెప్పి రిషితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత గౌతమ్ ఇంటికి రావడంతో ధరణి మహేంద్ర వాళ్ళ గురించి అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి, దేవయాని గౌతమ్ వసుధర అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుతూ ఉంటారు.

అప్పుడు రిషి బాధపడుతుండగా దేవయాని మాత్రం జగతి దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ రిషి ని మరింత రెచ్చగొడుతుంది. అప్పుడు చూసి దాంట్లో తప్పేముంది పెద్దమ్మ నేను డాడ్ కి కొడుకును అవ్వకముందు మేడంకి డాడ్ భర్త అనటంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ మాట విని పక్కనే ఉన్న ధరణి గౌతమ్ వసుధారలు సంతోషంగా ఫీల్ అవుతారు.

Advertisement
jagathi-and-mahendra-get-emotional-in-todays-guppedantha-manasu-serial-episode
jagathi-and-mahendra-get-emotional-in-todays-guppedantha-manasu-serial-episode

ఆ తర్వాత వసుధార నువ్వు ఇంకా వెళ్ళవా అనటంతో వసు ఇక్కడే ఉంటుంది అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి వసుధారలు సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇద్దరు పీఏ ఫోన్ చేసీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి జగతి మేడం మహేంద్ర సార్ రాను అని చెప్పారు అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు..

Read Also : Guppedantha Manasu serial Oct 25 Today Episode : మహేంద్ర,జగతి లను తలుచుకుని కుమిలిపోతున్న రిషి.. ధరణి మీద విరుచుకుపడిన దేవయాని..?

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel