వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Weather report: మండిపోతున్న ఎండలు.. ఎక్కడ ఎంత ఉష్ణోగ్రతో తెలుసా?

రాష్ట్రంలో భానుడు భగభగా మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు నిప్పుల కొలమిలా భగభగ మంటున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా జైనద్​లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ అర్బన్​ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్​ రూరల్​ 42.1, నిజామాబాద్​ డిచ్​పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందొందేకు జ్యూస్ లు, కొబ్బరి బోండాలు వంటివి తాగుతున్నారు. అంతే కాకుండా పగటి పూట చాలా వరకు ... Read more

By Vinod Kumar

Published on: April 12, 2022 6:06 PM

Updated on: April 12, 2022 6:06 PM

---Advertisement---

రాష్ట్రంలో భానుడు భగభగా మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు నిప్పుల కొలమిలా భగభగ మంటున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా జైనద్​లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ అర్బన్​ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్​ రూరల్​ 42.1, నిజామాబాద్​ డిచ్​పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందొందేకు జ్యూస్ లు, కొబ్బరి బోండాలు వంటివి తాగుతున్నారు. అంతే కాకుండా పగటి పూట చాలా వరకు బయటకు రావడం లేదు.

మరో వైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరిగాయి. వేడి వేడి గాలులుతో ప్రజలు ఆగమై పోతున్నరు. అయితే ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నిజామాబాద్‌లలో 27, హైదరాబాద్‌, ఖమ్మం, రామగుండంలలో 26, దుండిగల్‌లో 25, హనుమకొండలో 24 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణంగా చలి కాలం, వర్షా కాలంలో పగటి పూట ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel