Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Acharya Movie : ఆచార్య సినిమా టికెట్ ధర పెంచుకునేందు ఏపీ ప్రభుత్వం అనుమతి!

Acharya movie : ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఐదో

By Vinod Kumar

Published on: April 26, 2022 1:34 PM

Updated on: April 26, 2022 5:36 PM

Acharya movie

---Advertisement---

Acharya movie : ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఐదో షో విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరను 50 రూపాయలు పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి పది రోజుల పాటు మాత్రమే కొత్త ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

Acharya movie
Acharya movie

100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం దాటిన చిత్రాలకు టిక్కెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

Advertisement

Read Also : Big Boss Non Stop Telugu: 9వ వారం నామినేషన్స్ లో ..ఉన్న కంటెస్టెంట్ వీళ్ళే?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.