Akira nandan : వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటించిన చిత్రం మేజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా చాలా బాగుందంటూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా… మేజర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న అడవి శేష్… తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అకీరాతో అడవి శేష్ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనిపై అడవి శేష్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం లేదని… అసలు అకీరాకి యాక్టింగ్ అంటే ఇష్టమో లేదో కూడా తెలియదని వివరించాడు. అకీరాకి మ్యూజిక్ అంటే ఇష్టం అని తెలిపాడు. అకిరా తనకి చాలా క్లోజ్ అని చెప్పాడు. పవన్ కల్యామ్ తో మాట్లాడింది చాలా తక్కువని కాకపోతే అకిరాతో రోజూ మాట్లాడుతుంటానని చెప్పాడు. అకీరా ప్లే చేసిన మ్యూజిక్ బైట్స్ ని తనకు సెండ్ చేస్తాడని వివరించాడు. అకిరా, తాను క్లోజ్ అని అడవి శేష్ వివరించారు.
Read Also : Keerthi suresh: మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్.. అందులో ఏముందంటే?















