Keerthi suresh : మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్.. అందులో ఏముందంటే?

Keerthi suresh : కీర్తి సురేష్ కు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఖాతాలో కూడా ఓ హిట్ పడినట్లు అయింది. అయితే సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదల కాగా… బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. అయితే వీటిన్నిటిపై స్పందిస్తూ… కీర్తి సురేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Keerthi suresh
Keerthi suresh

కీర్తి సురేష్ నటించిన సాని కాయిదం అనే సినిమాతో పాటు సర్కారు వారి పాట చిత్రాలు పెద్ద విజయాలు అందుకున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా రెండు సినిమాలు చేసిన టీంకు ధన్యవాదాలు తెలిపింది. “ప్రియమైన వారందరికీ నా మాట ఇది. నటిగా ఉండటం అనేది హానికర ఎగుడుదిగుడు ప్రయాణం లాంటిది. మనం ఎత్తులు పల్లాలు చూస్తాం. కానీ ఈ ప్రయాణం తరచుగా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవలి గతం నాకు పరీక్షా సమయం లాంటిది. ఇది ఒక దశ. ప్రపంచానికి నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతర కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది” ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

 

Advertisement
View this post on Instagram

 

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel