Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

7 people died in Fire accident: లుథియానాలో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం!

పంజాబ్​లోని లుథియానాలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అందులోనూ ఇద్దరు దంపత

By Vinod Kumar

Published on: April 20, 2022 9:55 AM

Updated on: April 20, 2022 9:55 AM

---Advertisement---

పంజాబ్​లోని లుథియానాలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అందులోనూ ఇద్దరు దంపతులు వారు సంతానమైన ఐదుగురు పిల్లలు ఒకేసారి చనిపోవడం చూపరులను కంట తడి పెట్టిస్తోంది. అయితే అర్థరాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులుగా అధికారులు గుర్తించారు.

seven people died in luthiana fire accident

Advertisement

అసలే ఎండాకాలం ఆపై కాస్త మంట వచ్చినా ఎలాంటి ఇళ్లైనా తగలబడిపోతుంది. కాబట్టి ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో మంటలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఐదుగురు చిన్న పిల్లలు సహా దంపతులు సజీవ దహనం అవ్వడం చాలా బాధాకరం అని వివరిస్తున్నారు.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :