Devotional Tips : చనిపోయిన వారి ఫోటోలు దేవుని గదిలో పెట్టి పూజిస్తున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతగానో అభిమానించే ప్రేమించేవారు చనిపోతే ఆ బాధ నుంచి బయట పడటం ఎంతో కష్టమవుతుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఎంతో అపురూపంగా చేసుకుంటాము.ఇలా తనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారిని దైవ సమానులుగా భావించి వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజలు చేస్తుంటారు. నిజంగా ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజించవచ్చా? ఇలా పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

మన కుటుంబంలో మనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. చనిపోయిన వారిని దైవ సమానులుగా ఎప్పుడు భావించకూడదు.అందుకే వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి దేవుడితో సమానంగా పూజలు చేయకూడదు.ఇలా చేయటం వల్ల ఆ భగవంతుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఇబ్బందులు మానసిక అశాంతి కలుగుతుంది.

చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో లివింగ్ రూమ్ లో పెట్టాలి. అది కూడా ఈ ఫోటోలను ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశ వైపు వేలాడదీస్తూ వారు ఉత్తర దిశవైపు చూసే విధంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయి మనం అనుకున్న పనులు తొందరగా నెరవేరతాయి. అంతేకాని చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు కూడా దేవుడు గదిలో పెట్టకూడదు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

నేను రమేష్ బాబు. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటాను.

Read More

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel