October 5, 2024

Road accident in mathura: యూపీ, మహారాష్ట్రల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి!

1 min read
14 people died in up and maharashtra accident

Road accident in mathura: ఉత్తర ప్రదేశ్ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శినివారం వేకువ జామున దిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్ ప్రెస్ వేపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్ని ముథురా జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా నోయిడాలో ఓ వివాహ వేడుకకు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

14 people died in up and maharashtra accident

అయితే మహారాష్ట్రలో టవేరా వాహనం ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఏడుగురు మృతి చెందారు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఉమ్రేద్​ మార్గ్​లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. టవేరా అతివేగంతో ప్రయాణించి ట్రక్కును ఓవర్​టేక్​ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.