...

SP Balasubrahmanyam: బాలుకి ప్రేమతో.. జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో నీరాజనం!

SP Balasubrahmanyam : తెలుగు పాటంటే అందరి మదిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గుర్తుకు వస్తారు. సుమారు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతూ ఎన్నో వందల పాటలను పాడి అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఈ క్రమంలోనే ఆయన జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. జులై 4వ తేదీ బాలసుబ్రమణ్యం జయంతి కావడంతో ఆయన చేసిన సందర్భంగా బాలుకి ప్రేమతో 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు.

SP Balasubrahmanyam
SP Balasubrahmanyam

ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు, ఆర్‌.పి పట్నాయక్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ– బాలు గారు అంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎస్పీ బాలు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత కచేరి నిర్వహించి బాలు గారిజయంతిని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ వెల్లడించారు..

ఇకపోతే బాలుగారు జయంతి సందర్భంగా ఈ యూనియన్ లో భాగమైన సింగర్ లో కూడా బాలు గురించి, ఈ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బాలుకి ప్రేమతో అనే కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా
సినీ మ్యూజిషియన్‌ యూనియన్స్ వెల్లడించారు. ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్నారు.

Read Also : Viral video: డ్యాన్స్ తో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వేదికపైకి వస్తూ ఫుల్ జోష్

Related Articles

ADVERTISEMENT

SEARCH ON SITE

LATEST ARTICLES

ARCHIVES