Petrol Prices Today : దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దాదాపు పన్నెండు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది.

- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
- వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.
Read Also : Petrol rate hike: లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయలు పెంపు.. ఎక్కడో తెలుసా?
Advertisement