Hyderabad Metro : మరింత వేగంతో పరుగులు పెట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు..!

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణ సమయం మరింత తగ్గనున్నట్లు మెట్రో కమిషనర్ ఎండీ తెలిపారు. ఈరోజు నుంచి మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేగం కంటే మరో 10 కిలో మీటర్ల అదనపు వేగంతో వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి లభించింది. గత నెలలో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు భాగ్య నగర మెట్రో రైళ్లను పరిశీలించారు. రైళ్ల వేగం, భద్రతను గురించి అధికారులను ఆరా తీశారు. వేగం పెంచడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గనుందని మెట్రో అధికారులు తెలిపారు.

అయితే గతంలో కంటే నాగోల్ -రాయదుర్గంకు 6 నిమిషాలు, మియపూర్-ఎల్బీనగర్ కు 4 నిమిషాలు, జేబీఎస్ -ఎంజీబీఎస్ కు ఒక నిమిషం ప్రయాణ సమయం ఆదా కానుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తుండగా.. తాజా నిర్ణయంతో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి స్టేషన్ వద్ద ఆగడంతో ఈ వేగం ఓవరాల్​గా కొంత వరకు తగ్గనుంది.

Read Also : Niharika in pub case: బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel