Health Tips: సాధారణంగా మనం ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే వారు తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలా కడుపు నొప్పితో బాధపడటానికి కారణం నులి పురుగులు కూడా కావచ్చు.అపరిశుభ్రమైన ఆహారం కలుషితమైన నీరు తీసుకోవటం లేదా మట్టిలో పిల్లలు ఆడుకొని అదే చేతులతో తినటం వల్ల నులిపురుగులు ఏర్పడతాయి. అయితే ఈ నులిపురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించి నులిపురుగులు బలపడుతూ మనల్ని బలహీనం చేస్తాయి.
ఈ ఆకుతో కేవలం నులిపురుగుల సమస్యలకు మాత్రమే కాకుండా మలబద్ధకం సమస్యను కీళ్లనొప్పుల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కుప్పింటాకు రసంలోకి టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేయడం వల్ల నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ ఆకురసం కొందరి శరీర తత్వానికి సరిపోదు. అలాంటి వారు తాగక పోవడమే మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చే వారు కూడా ఈ ఆకు రసం తాగకపోవడం ఎంతో మంచిది.
