Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Pitru Paksha: పెద్దల అమావాస్య నాడు చేయాల్సిన, చేయకూడని పనులివే..?

Pitru Paksha: మహాలయ అమావాస్య, పితృ పక్షం, పెత్తర అమావాస్య, పెద్దల అమావాస్య… ఇలా పేర్లు వేరైనా ఇవన్నీ ఒక్కటే. ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యనే పితృ పక్షం అంటారు. తమను వదిలి వెళ్లిన తల్లిదండ్రులు పూర్వీకులను తలచుకొని పితృ పక్షంలో వారికి పూజలు చేస్తారు. తమను విలి వెళ్లిన తల్లిదండ్రులు పూర్వీకులను తలచుకొని పూజలు చేస్తారు. తద్వారా పితృ దేవతల అనుగ్రహం కల్గి పితృదోష ... Read more

By Vinod Kumar

Published on: August 9, 2022 12:00 PM

Updated on: August 9, 2022 8:49 AM

---Advertisement---

Pitru Paksha: మహాలయ అమావాస్య, పితృ పక్షం, పెత్తర అమావాస్య, పెద్దల అమావాస్య… ఇలా పేర్లు వేరైనా ఇవన్నీ ఒక్కటే. ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యనే పితృ పక్షం అంటారు. తమను వదిలి వెళ్లిన తల్లిదండ్రులు పూర్వీకులను తలచుకొని పితృ పక్షంలో వారికి పూజలు చేస్తారు. తమను విలి వెళ్లిన తల్లిదండ్రులు పూర్వీకులను తలచుకొని పూజలు చేస్తారు. తద్వారా పితృ దేవతల అనుగ్రహం కల్గి పితృదోష విముక్తి జరుగుతుంది. ఈ ఏాది పితృ పక్షం ఎప్పుడు వస్తుంది, దేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి తదితర అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు పితృ పక్షం ఉంటుంది. ఈ 15 రోజుల్లో తిథి ప్రకారం తమ పితృ దేవతలను పూజించాలి. ఏ తిథిలో చనిపోతే ఆ తిథి నాడు పితృ దేవతలను పూజించాలి. తద్వార సంతాన లేమి వంటి సమస్యలు తొలగుతాయి. పితృ పక్షంలో కొత్త ఇల్లు కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ ప్రవేశం, క్షవరం, కొత్త దుస్తులు ధరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయద్దు. అలాగే మాంసాహారాన్ని భుజించవద్దు. ఆహారంలో వెల్లల్లిని తీసుకోవద్దు. పితృపక్షంలో పితృ దేవతల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు పిండ దానం, శ్రాద్ధం నిర్వహిస్తారు. నదీ స్నానం ఆచరించి జలచరాలకు లేదా కాకులకు పిండదానం చేయడం ద్వారా పితృదో విమోచనం కల్గుతుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.