Crime news: భర్తను మార్చుకోవాలని ప్లాన్ వేసింది.. అదే అతడి పాలిట యమపాశమైంది!

Crime news: భర్త తరచూ తనను అనుమానించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎత చెప్పినా అతడు వినకపోవడంో బాధతో పుట్టింటికి చేరింది. ఏమైందని తల్లి అడగ్గా తన మనసులోని మాటలు చెప్పి భారాన్ని దించుకుంది. అయితే అల్లుడు కూతురును అనుమానిస్తాన్నడని తెలుసుకున్న ఆ తల్లి.. అతడిని మార్చి కూతురుకు మంచి జీవితాన్ని అందించాలనుకుంది. బావను భయపెట్టి చెల్లి జీవితం బాగుపడేలా చేయమని కొడుక్కు చెప్పింది. అదే వారి చేసిన తప్పు. కోపంతో వెళ్లిన కుమారుడు బావపై విరుచుకుపడ్డాడు. నా చెల్లినే అనుమానిస్తావా అంటూ చితకబాదాడు. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడు.

కర్ణాటకలోని మండ్యకు చెందిన మహేష్ కు అదే గ్రామానికి చెందిన శిల్పతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. బెంగళూరులో కోణనకుంటెలో నివాసం ఉంటున్నారు. అయితే పని నిమిత్తం మహేళ్ మండ్యలో ఉంటూ అప్పుడప్పడూ బెంగళూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలోనే భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. అది తట్టుకోలేని శిల్ప పుట్టింటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. అది కాస్త ఆమె అన్నకు తెలియడంతో బావను భయపెట్టి చెల్లి జీవితం బాగు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బావను విపరీతంగా కొట్టాడు. అది తట్టుకోలేక అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అయిన బాలాజీ పరారీలో ఉన్నాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel