Student interaction with cm jagan: ఆ పిల్లాడు ఐఏఎస్ అయ్యేదాకా.. జగనే సీఎంగా ఉండాలట!

Student interaction with cm jagan: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టంపై కొందరు అనసవర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. రేష్మా అనే పదో తరగతి విద్యార్థఇని మాట్లాడిన తీరుకు సీఎం జగన్ మురిసిపోయారు. హామిలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని తెలిపింది.

Student interaction with cm jagan
Student interaction with cm jagan

అలాగే అనుదీప్ అనే విద్యార్థి మాట్లాడుతూ… నేను ఐఏఎస్ అయ్యే వరకూ మీరే సీఎంగా ఉండాలంటూ తెలిపాడు. బాలుడి మాటలు విన్న సీఎం నవ్వుల్లో మునిగితేలారు. అలాగే మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. దాని వల్లే తాము అంత బాగా ఇంగ్లీష్ నేర్చుకోగల్గుతున్నామని వివరించింది.
Read Also : AP CM Jagan : ఏలూరు అగ్నిప్రమాద బాధితులకు 25 లక్షల నష్ట పరిహారం..!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel