Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..!

Ram Gopal Varma : ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగింది. లేటెస్ట్ వెంచర్ “సిండికేట్” ప్రకటించే ఒక రోజు ముందు ముంబైలోని కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు.

దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు. మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని వర్మను కోర్టు ఆదేశించింది.

Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు ఏంటి? :

2018లో మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ అనే కంపెనీ చెక్ బౌన్స్ కేసును వేసింది. ఈ కేసు వర్మ సంస్థపై ఉంది.
సత్య , రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి చిత్రాలతో విజయాన్ని రుచి చూసిన వర్మ ఇటీవలి సంవత్సరాలలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారు.

ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తన ఆఫీసును అమ్ముకోవాల్సిన సమయంలో ఆర్థికంగా చితికిపోయారు. ఈ ప్రత్యేక కేసులో, జూన్ 2022లో, పీఆర్, రూ. 5,000 నగదు భద్రతను అమలు చేయడంపై కోర్టు బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు పరిశీలనలతో కూడిన వివరణాత్మక తీర్పు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.

Read Also : Abhishek Sharma : 8 సిక్సర్లతో అద్భుత అర్ధ సెంచరీ.. గురు యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ..!