father-killed-her-daughter-he-strangled-and-killed-her-daughter
Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు.
వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులకు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోషించే స్తోమత లేక కన్నతండ్రి ఆ చిన్నారి పట్ల కసాయివాడు ప్రవర్తించి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. బాపన్ కుంట తండాకు చెందిన నరేష్, రజిత గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 19 నెలల వయసున్న చిన్నారి ఉంది.
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో తన కడుపున పుట్టిన కూతురిని పెంచి పోషించలేని భావించిన నరేష్ అభం శుభం తెలియని చిన్నారి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. కూతురి ఆలనా పాలనా చేసుకోలేక చిన్నారి ప్రాణాలు తీయడమే మార్గమని భావించి చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.