Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు.
వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులకు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోషించే స్తోమత లేక కన్నతండ్రి ఆ చిన్నారి పట్ల కసాయివాడు ప్రవర్తించి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. బాపన్ కుంట తండాకు చెందిన నరేష్, రజిత గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 19 నెలల వయసున్న చిన్నారి ఉంది.
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో తన కడుపున పుట్టిన కూతురిని పెంచి పోషించలేని భావించిన నరేష్ అభం శుభం తెలియని చిన్నారి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. కూతురి ఆలనా పాలనా చేసుకోలేక చిన్నారి ప్రాణాలు తీయడమే మార్గమని భావించి చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.