రాజస్థాన్ ఝున్ఝునూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. అయితే ఝున్ఝునూ- గుఢా రోడ్ హైవే వద్ద మంగళ వారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
ఓ ఆలయ దర్శనానికి వెళ్లి.. తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించిన సీఎం.. వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.