...
Telugu NewsCrimeRoad accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పది మంది దుర్మరణం!

Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పది మంది దుర్మరణం!

రాజస్థాన్​ ఝున్​ఝునూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్​ చేసి ఉన్న ఓ ట్రాక్టర్​ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. అయితే ఝున్​ఝునూ- గుఢా రోడ్ హైవే​ వద్ద మంగళ వారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Advertisement

ఓ ఆలయ దర్శనానికి వెళ్లి.. తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించిన సీఎం.. వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు