Kidnap:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ దగ్గర ఏదైనా కొత్త వస్తువు ఉన్న లేదా కొత్త బంగారు నగలు కొనుగోలు చేసిన వాటిని ఫోటోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను ఎంతోమంది చూస్తారు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇలా ఈ యువకుడు తన వద్ద ఉన్న సంపద గురించి అందరికీ తెలియజేయడంతో వివేక్ చతుర్వేది అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో అన్మోల్ అరోరాను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. పథకం ప్రకారం వివేక్ చతుర్వేది అన్మోల్ అరోరాను కిడ్నాప్ చేసి తనని విడిచి పెట్టాలంటే కోటి రూపాయలు కావాలని బాధిత కుటుంబానికి డిమాండ్ చేశారు.ఇక ఈ విషయంపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు వివేక్ చతుర్వేది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.