Ys Jagan: 2024 ఎన్నికల్లో జగన్ సరికొత్త నినాదం.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయం?

Ys Jagan New Strategy : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు మాత్రమే పూర్తి చేసుకోగా, సీఎం జగన్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం మంత్రులు, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా వెళ్లాయట..

సరిగ్గా రెండేళ్ల ముందు నుంచే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసం ప్రతిఒక్కరూ సిద్దంగా ఉండాలని జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలియడంతో ప్రతిపక్షాలు కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Advertisement

జగన్ సరికొత్త నినాదమే గెలిపిస్తుందట.. :
2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని నినాదంగా ఎంచుకున్నారు. అయితే, అధికారంలోకి వచ్చాక కేంద్రంతో పలుమార్లు ప్రత్యేక హోదా గురించిన చర్చించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్రం కూడా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాత్రమే మాట్లాడింది..

కానీ, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తెలిపింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పడేయాలని చూస్తోంది. దాని స్థానంలో ‘మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధిని’ నినాదంగా ఎంచుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఈ నినాదాన్ని ప్రజలు తప్పక ఆదరిస్తారని జగన్ బలంగా నమ్మారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.
Ashwagandha : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!

Advertisement

 ఇప్పటి నుంచే ప్రణాళికలు :
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రతిపక్షాలు తప్పకుండా ప్రశ్నిస్తాయి. అందుకోసం జగన్ ప్రభుత్వం ప్రజలను ఎలా మెప్పించాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ‘మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధి’ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారి కృషిని చూపించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధిపై రెండు సార్లు అసెంబ్లీ, మండలిలో సమావేశం నిర్వహించి మరీ చట్టం చేసినట్టు ప్రచారం చేయాలని చూస్తున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ఈ అంశం న్యాయ సమీక్ష కోసం వెళ్లగా, హైకోర్టులో కేసు నడుస్తోంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చినా, ప్రతిపక్షాలు మూడు రాజధానుల అంశాన్ని మళ్లీ సుప్రీంలో సవాల్ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రతిపక్ష టీడీపీ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఎన్నికల్లో దోషిగా చిత్రీకరించేందుకు వైసీపీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనిపై టీడీపీ ప్రజలకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోతే మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More :
Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!    

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…

1 week ago

This website uses cookies.