Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Naga chaitanya : సామ్ తో మళ్లీ అలా చేయాలో లేదో ప్రజలే చెప్పాలి..!

Naga chaitanya : నాగ చైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య కాంబోలో రాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఫారెస్ట్ గంప్ సినిమాను ఇండియన్ ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆమిర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో నేషనల్ మీడియా నాగ చైతన్య పర్సనల్ విషయాల మీద ఫోకస్ పెట్టేసింది. అయితే తెకిక్ సో నేను సాధించిన విజయాలకంటే నా వ్యక్తిగత జీవితం క్కువగా హెడ్ లైన్స్ లో నిలవడం చూస్తుంటే చిరాకుగా ఉందని తెలిపారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలను ఏదో ఒక ప్రకటన రూపంలో తెలియజేస్తుంటానని అన్నారు.

Naga chaitanya intresting comments on samantha

మంచైనా చెడైనా తన జీవితం గురించి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పినట్లు వివరించారు. అయితే సామ్, తాను విడిపోయిన పర్సనల్ కారణాల గురించి మాత్రం చెప్పలేనని అన్నారు. అయితే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలు, ఊహాగానాలన్నీ తాత్కారికమైనవేనని అన్నారు. అలాగే సామ్ తో మళ్లీ సినిమాల్లో కలిసి నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు… ఏమో తనతో నేను అలా చేస్తానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని కామెంట్లు చేశారు.

Read Also : Naga Chaitanya : ఏంటీ నాగచైతన్య ఇన్ని రోజులు ఆ సమస్యతో బాధపడుతున్నారా… వాటిని పెట్టుకునేది స్టైల్ కోసం కాదా?

Advertisement
Exit mobile version