భోజనం సమయంలో చాలా మందికి వచ్చే డౌట్.. నీరు ఎప్పుడు తాగాలి. భోజనం పూర్తయిన తర్వాతనే నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. కానీ కొందరికి మధ్య మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా మధ్యమధ్యలో నీరు తాగితే ఏమవుతుంది. అసలు నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. తినడానికి ముందు నీరు తాగితే ఆహారాన్ని మితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వీరికి తోడు వైద్యులు సైతం ఇదే చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు, ఆహారాన్ని మితంగా తీసుకోవాలని భావించే వారు భోజనానికి ముందు నీరు తాగాలని సూచిస్తున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకునే ముందు నీరు తాగితే బలహీనత, స్పృహ కోల్పోయే ప్రమాదముందని చెబుతోంది.
భోజనం చేసేటప్పుడు దాహం వేసినా, లేదా ఎక్కిళ్లు వచ్చినా కేవలం కొద్ది పరిమాణంలోనే నీరు తాగాలి. చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణాశయంపై ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం భోజనం చేసే సమయంలో నీరు తక్కువగా తాగడం మంచిది. దీని వల్ల ఆహారం విచ్చిన్నంలో నీరు ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇక భోజనం ముగిశాక వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల ఊబకాయం పెరిగే ఛాన్స్ ఉంది. భోజనం ముగిసిన తర్వాత 30 నిమిషాల పాటు విరామం తీసుకుని నీరు తాగడం మంచింది. భోజనం చేసే టైంలో సోడా, కాఫీ లాంటివి తాగొద్దు. ఆహారం జీర్ణం అయ్యేందుకు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగడం మంచింది. ఈ టిప్స్ పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. లేదంటే అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.