Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 75 రూపాయలు పెరిగి రూ.55,325 వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో  పది గ్రాముల బంగారం ధర రూ.54,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,720 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,325 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,720గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,325 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,720 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.55,325 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,720 వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,974 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.80 డాలర్లుగా ఉంది.

Advertisement
Exit mobile version