Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది. విజవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,810 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,480గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,810 గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,480గా ఉంది. అలాగే ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,810 గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,480 ఉంది.

Advertisement

అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,976 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.81 డాలర్లుగా ఉంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Advertisement
Exit mobile version