Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

PM Kisan Yojana : రైతులకు భారీ గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 22వ విడత రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

PM Kisan Yojana 22nd Installment

PM Kisan Yojana 22nd Installment ( Image Credit: AI-generated using ChatGPT )

PM Kisan Yojana 22nd Installment : దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద అర్హత పొందిన భూమి ఉంటే రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది.

పీఎం కిసాన్ పథకం కింద అందుకున్న ఈ మొత్తం రైతులు తమ వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చుకోవచ్చు. 22వ విడత (PM Kisan 22nd Installment) విడుదలకు ముందు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు.

అనేక నివేదికల ప్రకారం రాబోయే విడత రూ. 2,000 ఫిబ్రవరి, మార్చి 2026 మధ్య లబ్ధిదారుల అకౌంట్లలో బదిలీ అవుతుంది. ఈ పథకం 21వ విడత నవంబర్ 19, 2025న విడుదల అయింది.

Advertisement

ఎవరు అర్హులు? :

పీఎం కిసాన్ KYC అవసరమా? : (PM Kisan Yojana 22nd Installment )

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని రిజిస్టర్డ్ రైతులు KYC (నో యువర్ కస్టమర్) వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. పథకం ప్రయోజనాలు సరైన, నిజమైన లబ్ధిదారులకు చేరేలా ఎలాంటి దుర్వినియోగం లేదా మోసాలు జరగకుండా ఉండేలా ప్రభుత్వ ప్రక్రియ చేపట్టింది. కేవైసీ పూర్తి చేయని రైతులు తమ వాయిదాలలో ఆలస్యం జరగవచ్చు లేదంటే వారి చెల్లింపు కూడా నిలిచిపోవచ్చు.

KYC ఎలా పూర్తి చేయాలి? : (PM Kisan Yojana)

22వ వాయిదా స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? :

Advertisement
Exit mobile version