Karate kalyani: కరాటే కళ్యాణి అంటే తెలియని వారుండరు.కళ్యాణి పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. మొదట హరికథ కళాకారినిగా తన జీవితం ప్రారంభించిన కరాటే కళ్యాణి సినిమా అవకాశాలు రావడంతో ఆది సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కళ్యాణి సినిమాలలోనే కాకుండా పలు సీరియళ్లలో కూడా నటించింది. మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా కరాటే కళ్యాణి పాల్గొని గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం కరాటే కళ్యాణి వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచింది. యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డితో జరిగిన గొడవ కారణంగా కరాటే కళ్యాణి ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది.
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో జరిగిన వివాదంపై పోలీసులను ఆశ్రయించిన కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ సి ఐ సైదులు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద దాడి చేసిన వ్యక్తి పై ఫిర్యాదు చేస్తే ఇద్దరి మీద ఒకే రకమైన కేసులు పెట్టి నిందితుడికి వంతు పాడతారా అంటూ ఆమె సిఐ మీద ఫైర్ అయ్యారు. ఈ వివాదం గురించి సీఐ సైదులు మాట్లాడుతూ చట్టప్రకారంగానే ఇరువురి వద్ద ఫిర్యాదులు తీసుకొని ఇద్దరు మీద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తర్వాత మొదట దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
