Shivaratri: హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజుశివుడు లింగ రూపంలోకి ఉద్భవించాడని అందుకు ప్రతిగా ప్రతి ఏడాది ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక అభిషేకము చేసి పూజించడమే కాకుండా ఉపవాసంతో తెల్లవార్లు జాగరణ చేస్తూ స్వామి వారిని పూజిస్తుంటారు.శివరాత్రి రోజు ఇలా ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయానికి వస్తే….
ఇలా తనకు తెలియకుండానే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ స్వామిని పూజించడం వల్ల ఆయనకు ఎంతో పుణ్యఫలం దక్కింది. ఆ బోయవాడు మరణించిన తర్వాత తనకు ఎలాంటి జన్మ లేకుండా ఏకంగా కైలాసానికి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి.ఇలా అప్పటినుంచి శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తూ ఉపవాసంతో స్వామిని పూజిస్తారో వారికి మరణాంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం అనేది అప్పటినుంచి ఆచరణలో ఉంది.
- Health Benefits Of Maredu chettu: అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మారేడు.. పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం?
- Lord Shiva: ప్రతి సంవత్సరం పెరిగే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా… ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
- Devotional Tips : శని ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!
