Crime News: ఈ మధ్య కాలంలో కొందరు ప్రజలు ప్రేమకు కులం,మతం, వయసు అడ్డు కాదని చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమించిన వారిని మొదలుకొని వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా వారిని మర్చిపోలేక మళ్లీ వారితో కలిసి జీవించడానికి దారుణాలకు వడికడుతున్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది.
శ్రీనివాస్ చోడవరం బజాజ్ షో రూమ్ లో పని చేస్తున్నాడు. హేమలత కు వివాహం జరిగినా కూడా శ్రీనివాస్ తో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. హేమలత విషయం తెలుసుకున్న భర్త, తండ్రి ఆమెను మందలించగా శ్రీనివాస్ తో కలిసి ఇంటి నుండి పారిపోయింది. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం కూలి పనులకు వెళ్లిన కొందరు వ్యక్తులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.