Andhra News: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో 69 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన డ్రైవర్ సీట్లోనే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు బస్సును అదుపులో వుంచి అందరి ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
తిరుపతి నుంచి మదనపల్లికి వయా పుంగనూరు మీదుగా ప్రయాణికులతో బయలుదేరింది. అయితే చంద్రగిరి దాటగానే డ్రైవర్ రవికి తీవ్రమైన గుండెపోటు రావడంతో డ్రైవర్ సీటులోనే మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై తన తెలివితేటలతో బస్సు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా బస్సును నిలిపివేశాడు.
సరైన సమయానికి ప్రయాణికుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేదంటే బస్సులో ఉన్నటువంటి 60 మంది ప్రయాణికులు ప్రాణాలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడేవి. ఇక సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవర్ మదనపల్లి డిపోకు చెందిన రవిగా పోలీసులు గుర్తించారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.