Electric bike blast
Electric bike blast : : పర్యావరణానికి మేలు చేసే ద్వచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. కానీ అదే బైకు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన విజయవాడలోని సూర్యారావు పేట గులాబీ తోటలో చోటు చేసుకుంది.
సూర్యారావు పేటకు చెందిన శివ కుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అయితే దాన్ని తీసుకొచ్చి ఇంట్లోని బెడ్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టాడు. కానీ దురదృష్ట వశాత్తు వేకువజామున ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో శివకూమార్ ఆయన భార్య సహా ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. ఒక్కసారిగా పేలిన శబ్దం వినిపించడంతో స్థానికులంతా ఘటనా స్థలికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బాధితులు తీవ్ర గాయాల పాలయ్యారు. శివ కుమార్ దంపతులు సహా పిల్లలిద్దరినీ.. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ శివ కుమార్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. పిల్లలతో సహా తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Read Also :Kodada Crime : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్లో మత్తు కలిపి యువతిపై 3 రోజులుగా అత్యాచారం..!
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.