Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.350 పెరిగి రూ.53,590గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.500కు పైగా పెరిగి రూ.57,435 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,590గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,435గా ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,590గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.57,435గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,590గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,435గా వద్ద కొనసాగుతోంది.

Advertisement

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,590గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,435గా వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1762 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.38డాలర్లుగా ఉంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Advertisement
Exit mobile version