AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతగా నిర్దేశించుకున్నఅంశాలకు బ్యాంకుల సహకారం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం జరిగిన 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలను మంజూరు చేసి అనగారిన వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా దోహదం చేయాలని ఈయన బ్యాంకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ రూ.3,19,480 కోట్లతో 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్ కావడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశాలు చేశారు. ఇకపోతే వ్యవసాయ రంగంలో డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం బ్యాంకర్లు డ్రోన్ టెక్నాలజీ సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇక ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో పలు పథకాల అమలు గురించి కూడా ఆయన అధికారులతో చర్చించారు.
