Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Navagraha Dosham: నవగ్రహ దోషాలతో సతమతమవుతున్నారా.. నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే చాలు?

Navagraha Dosham: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం పై జ్యోతిషశాస్త్ర ప్రభావం ఎంతగానో ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల మనం ఎలాంటి పనులు చేసిన ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహదోషాలు ఉన్న ఏలాంటి పనులు చేపట్టాలని ప్రయత్నం చేసిన విజయవంతం కాలేక సతమతమవుతూ ఉంటారు. ఇలా నవగ్రహదోషాలతో బాధపడేవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.మరి నవగ్రహ దోషాలతో బాధపడేవారు దోష పరిహారం చేయడానికి నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే దోష ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

if you take a bath with these in water for a navagraha doshas

సూర్యుడు: సూర్య దోషం ఉన్న వాళ్ళు నీటిలోఎర్రని పుష్పాలు యాలకులు కాస్త కుంకుమ పువ్వు వేసి స్నానం చేయడం వల్ల సూర్య గ్రహ దోష ప్రభావం తొలగిపోతుంది.

చంద్రుడు: ఈ దోషంతో బాధపడేవారు నీటిలో తెల్లటి పుష్పాలను, తెల్లటి గంధం, రోజ్ వాటర్ లేదా శంఖములో నీటిని నింపి ఆ నీటితో స్నానం చేయటం వల్ల చంద్ర గ్రహ దోషం తొలగిపోతుంది.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

అంగారకుడు: ఈ గ్రహ దోషంతో బాధపడేవారు నీటిలో ఎర్రచందనం బెరడు, బెల్లం కలిపి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

బుధ గ్రహం: బుధ గ్రహ దోషం తొలగిపోవాలంటే నీటిలో బియ్యం, జాజికాయ, తేనె కలిపి స్నానం చేయడం వల్ల బుధ గ్రహ దోషం తొలగిపోతుంది.

బృహస్పతి: నీటిలో ఆవాలు, పసుపు, మల్లెపువ్వులు, తమలపాకులను కలిపి స్నానం చేయడం వల్ల గురు గ్రహ దోషం తొలగిపోతుంది.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

శుక్ర గ్రహం: శుక్ర గ్రహంతో బాధపడేవారు నీటిలో యాలకులు, తెల్లని పుష్పాలు, రోజ్ వాటర్ వేసి స్నానం చేయడం వల్ల ఈ దోషం తొలగిపోతుంది.

శని గ్రహం: శని దోషంతో బాధపడేవారు నీటిలో నల్ల నువ్వులు, సోంపు, సుగంధ ద్రవ్యాలు కలిపి కూడా స్నానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది.

రాహు దోషం: రాహు దోషంతో సతమతమయ్యేవారు నీటిలో సంపు సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయడం వల్ల ఈ దోషం తొలగిపోతుంది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

కేతు దోషం: సుగంధ ద్రవ్యాలు ఎర్రచందనం కలుపుకొని స్నానం చేయడం వల్ల కేతు దోషం తొలగిపోతుంది. ఇలా ఏ దేశంతో అయితే మనం బాధ పడతాను అలాంటి వారు నీటిలో ఆయా వస్తువులను కలుపుకొని స్నానం చేయడంతో గ్రహదోష ప్రభావం తొలగిపోతుంది.

Advertisement
Exit mobile version