Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral news : పెళ్లై మూడేళ్లవుతున్నా ఫస్ట్ నైట్‌కు నో.. గట్టిగా అడిగితే షాకిచ్చిన మొగుడు

Viral news: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక జీవితం హ్యాపీగా ఉంటుందని కలలు కన్నది. భర్తతో అచ్చటా ముచ్చటా ఉంటుందని , తాను సంతోషంగా గడపొచ్చని అనుకుంది ఆ యువతి. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పెళ్లై మూడేళ్ల తర్వాత తనకు ఓ నిజం తెలిసింది. తాను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. కన్న కలలు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయి. అసలేం జరిగిందంటే..

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇండోర్ కు చెందిన ఓ యువతికి 2019లో ప్రీతేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆమె తల్లిదండ్రులు రూ.25 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి ప్రతి దాంట్లోనూ షాక్ తగులుతూ వచ్చింది. కొత్త కదా అని అన్నీ సర్దుకుపోయింది ఆ యువతి. మొదటి రాత్రి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమెకు భర్త షాకిచ్చాడు. దగ్గరకు తీసుకుని ఊసులాడాల్సిన వాడు దూరం పెట్టాడు. ఆమె చొరవ తీసుకుని దగ్గరకు వెళ్తే తిట్టేవాడు. వాటిని పంటి బిగువన భరించింది ఆ యువతి. అలా మూడేళ్లు గడిచాయి.

Advertisement

కానీ ఒక్కసారి కూడా భార్యభర్తలకు శారీరకంగా దగ్గర కాలేదు. ఓపిక నశించిన యువతి కొడుకు చేస్తున్న తంతు గురించి అత్తగారికి చెప్పింది. అప్పుడు అత్తగారు చెప్పిన మాట విని షాక్ కు గురైంది ఆ యువతి. తన కొడుకుకు మానసిక, శారీరక సమస్యలు ఉన్నాయని, త్వరలోనే సర్దుకుంటాయని చెప్పింది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

మరోవైపు తన లోపాన్ని భార్య ఎక్కడ బయట పెడుతుందోనని భయపడ్డ ప్రితీషే కట్నం నాటకం ఆడటం మొదలు పెట్టాడు. రూ. 20 లక్షలు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో ఆ యువతి… అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ప్రితీష్ పై, అతని తల్లిదండ్రులపై కేసు పెట్టారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version