Minister Roja Selvamani : మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలి సారిగా సోమవారం రోజు తన నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రిగా మొదటి సారి నియోజక వర్గానికి వస్తుండటంతో ప్రజలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో చాలా సేపు నిల్చొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారని తెలిపారు. అలాగే నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని విధంగా మంత్రి పదవి ఇచ్చాడని పేర్కొంది. రాజకీయంగా ప్రజలకు, జగనన్నకు రుణపడి ఉన్నాని తెలిపింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే కొనసాగుతానని మంత్రి రోజా స్పష్టం చేసింది.
సీఎం జగన్ తనకు కేటాయించి పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో దృష్టిపెడతానని చెప్పారు. రోజాకు నెక్స్ట్ సీటు రాదు.. రోజా పని అయిపోయింది అని మాట్లాడిన వారి నోళ్లు మూత పడేలా ఇక్కడి ప్రజలు తనని రెండు సార్లు గెలిపించారని రోజా స్పష్టం చేశారు. అలాగే జగనన్న తనని నమ్మి మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. 2024లోనూ జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.