భారత్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్పై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కరెన్సీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్, ఉగ్ర వాదులకు నిధులను సమీకరించేందుకు ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ ఓ సెమినార్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిసాయం చేయడానికి ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతికతతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నా. అయితే ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అనేది అసాధ్యం. బోర్డు(అంతర్జాతీయ ద్రవ్యనిధి)లోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలి’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.కొవిడ్ మహమ్మారి సమయంలో భారత్లో సాంకేతిక వినియోగం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64శాతం ఉంటే భారత్లో సాంకేతిక వినియోగం రేటు 85శాతంగా ఉందన్నారు. సామాన్య ప్రజలు సైతం దీన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.