శ్రావణ భార్గవి సొంత యూట్యూబ్ ఛానల్‌లో అన్నమయ్య  ఒకపరి కీర్తన పాడింది

స్వయంగా పాడి అభినయిస్తూ 1.16 నిమిషాల నిడివితో వీడియో విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ అవుతుంది.

1.6 మిలియన్ వ్యూయర్స్‌ను క్రాస్ చేసి టాప్ 27 లిస్టులో నిలిచింది

ఈ సాంగ్ అంతగా వైరల్ కావడానికి కారణం అమ్మడుపై  నడుస్తున్న వివాదమే..

వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ భక్తిభావంతో పాడిన పాటను అపహాస్యం చేసిందంటూ ఆరోపణలు

ఆ పాటలో పడుకొని కాళ్లు ఊపుతూ కీర్తన పాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సినీనటీ కరాటి కళ్యాణి ఆమె కాళ్ళకి మెట్టెలు లేవని, మెడలో తాళిబొట్టు లేదంటూ ఫైర్ అయింది

కీర్తనలు పాడేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు అంటూ సెటైర్లు వేసింది.

సాంగ్ డిలీట్ చేయనన్న శ్రావణ భార్గవి వివాదాలను తట్టుకోలేక పాటను తొలగించింది