Gold Rates Today : బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. మహాశివరాత్రి రోజున బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. పండగ రోజున బంగారం కొనాలని అనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది. బంగారం ధరలు రాత్రికి రాత్రే పెరిగిపోయాయి.
అలాగే వెండి కూడా తగ్గినట్టే తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతోంది. వాస్తవానికి, గత రెండు రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరిగాయి. ఒక సమయంలో తులం బంగారం ఏకంగా రూ. 3800 వరకు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఎగబాకాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సు ధర 5 వేల డాలర్లు దాటేసింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 5041 డాలర్ల వద్ద ఉంది. అదే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఈరోజున 2.08 శాతం పెరిగింది. ఔన్స్ వెండి ప్రస్తుతం 77.41 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మహా శివరాత్రి నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
Read Also : Gold Price Today : ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ గోల్డ్ రేట్స్
హైదరాబాద్లో బంగారం ధరలివే :
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇటీవల తగ్గినప్పటికీ ఆదివారం (ఫిబ్రవరి 15) మళ్లీ పుంజుకుంది. మహాశివరాత్రి పర్వదినాన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 1970 వరకు పెరిగింది. దాంతో బంగారం ధర రూ.1,57,750 వద్దకు దూసుకెళ్లింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.1800 వరకు పెరిగింది. 10 గ్రాముల ధర రూ.1,44,600 వద్ద ట్రేడవుతోంది.
స్థిరంగా వెండి ధరలు :
బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మునపటి రోజున హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.20 వేలు వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో ధర రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆదివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

