ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు.

అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మానసిక స్థితి బాగోలేదని తెలిసింది

 ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. 

ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్ లోని తన సొంత నివాసంలో కన్నుమూశారు

ఈ మధ్యనే ఉమా మహేశ్వరి కూతురు వివాహం జరిగింది. 

ఈమె మరణ వార్త తెలిసి ఎన్టీఆర్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు

ఈమె మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.