పంచ్ డైలాగ్‌లతో అదరగొట్టే  డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 

డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీతో ముందుకు వచ్చాడు   

పూరీ జగన్నాథ్ కెరీర్‌లోనే అతి పెద్ద భారీ బడ్జెట్ మూవీగా అందులోనూ పాన్ ఇండియా రేంజ్‌‌లో లైగర్ మూవీ రిలీజ్ అయింది.

నిర్మాతలుగా ఛార్మీ, పూరి జగన్నాథ్ , బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ముగ్గురు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు

లైగర్ మూవీ కోసం పూరీ జగన్నాథ్ మూడు ఏళ్లుగా ఎంతో కష్టపడ్డాడు. విజయ్ దేవరకొండ కూడా సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు.

ఆగస్టు 25న లైగర్ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకుంది. లైగర్ అభిమానులు కూడా మూవీ కోసం ఎంతో ఎదురుచూశారు.

లైగర్ మూవీ రిలీజ్ రోజున పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నీకోసం ఎదురుచూస్తున్నామంటూ పోస్టు పెట్టింది.

లైగర్ మూవీ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

నాన్న సినిమా కోసం ఎదురుచూడటంలో ఎప్పుడు ఇంతగా ఫీల్ అవ్వలేదు. మై ఫరెవర్. నా లైఫ్ లో నేను ఇంత నెర్వస్ గా ఎప్పుడూ ఫీల్ అవలేదు.